అప్పులపాలైన యాక్సిస్ బ్యాంకు మేనేజర్ , ఐసిఐసిఐబ్యాంకు దోపిడీకి ప్రయత్నం చేసి , మేనేజర్ ని చంపేశాడు.. మహారాష్ట్రలోని పాల్గర్ లో విరార్ యాక్సిస్ బ్యాంకు మేనేజర్ అనిల్ దూబే , రాత్రి 7 గంటల సమయంలో ఐసిఐసిఐ బ్యాంకులోకి ప్రవేశించాడు. చేతిలో కత్తి చూపించి , మహిళా బ్యాంకు మేనేజర్ ను, క్యాషియర్ ను డబ్బులిమ్మన్నాడు. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దాదాపు 48 లక్షల రూపాయలు సంచిలో వేసుకున్నాడు. బ్యాంకు నుంచి పోతుండగా , మహిళా మేనేజర్ యోగిత , ఆమె క్యాషియర్ దేవ్ రూకర్ , అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో , చోరీకి వచ్చిన యాక్సిస్ బ్యాంకు మేనేజర్ అనిల్ , యోగితాను కత్తితో పొడవడంతో ఆమె చనిపోయింది. క్యాషియర్ కూ బలమైన కత్తిపోట్లు తగిలి , ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?