ఆడి కారు..
అల్లకల్లోలం చేసింది..
==============
జోధ్ పూర్ లో ఓ ఆడి కారు భీబత్సం సృష్టించింది. ఎయిమ్స్ రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా ఈ కారు, ద్విచక్ర వాహనదారులపైకి దూసుకొచ్చింది. దాదాపుగా 10 మంది మోటార్ బైకులను ఢీకొట్టి.. రోడ్డుపక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆడి కారు భీబత్సం చేసిన దృశ్యాలు చూస్తే గగుర్పాటు కలుగుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.