ఆ రాత్రి ఏమిజరిగిందో చెప్పండంటూ నటి అనసూయ అడుగుతొంది.. చీకట్లో ఏదైనా జరిగిపోయిందా ..? అటుఇటు తారుమారైందా అన్న అనుమానం ఆమెను పీడిస్తోంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీచేసిన అనసూయ ముందు గెలిచిందని ప్రకటించారు. తర్వాత రాత్రి ఏమైందో ఏమో , మరుసటి రోజు ఓడిపోయిందని ప్రకటించారు. రాత్రికిరాత్రి ఏమిజరిగింది..? అది తేలాలి అని అనుమానం వ్యక్తం చేసింది. 600 ఓట్లు లెక్కించటానికి 24 గంటలు అవసరమా..? బ్యాలెట్ పేపర్లు అన్నీ ఎవరో ఇంటికి తీసుకెళ్లారని అంటున్నారు.. నిజమేనా..? అంటూ అనుమానం వ్యక్తం చేసింది..