ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాణాపాయంలో ఉన్న రోగులు అడిగితే ఆనందయ్య ఇచ్చే కంటి చుక్కల మందు పంపిణీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. అవసరమైతే ఈ విషయంలో తామే ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు మాత్రం ఇందుకు కొంత సమయం పడుతుంది అన్నారు. కంటి చుక్కల మందుపై నివేదిక రావాల్సి ఉంది మరియు దాని స్టీరిలీటి పరీక్ష కూడా పూర్తి కావాల్సిఉందన్నారు..