లోకేషే బాగుంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొస్తుంది..?

    0
    1684

    తిరుపతి హోటల్ లో అచ్చెన్నాయుడు, వెంకట్ అనే వ్యక్తి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీగా మారింది. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదు, బొక్కా లేదు అని అనడంతో అచ్చెన్నాయుడు పూర్తిగా కార్నర్ అయ్యారు. అంతే కాదు, భావి నాయకుడిగా భావిస్తున్న నారా లోకేష్ పై కూడా అచ్చెన్నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. అచ్చెన్నాయుడితో ఉన్న వెంకట్ అనే వ్యక్తి లోకేష్ ని వాడు, వీడు అని కూడా అన్నారు. అయితే అచ్చెన్నాయుడు అతడ్ని వారించలేదు, తనకి కూడా ఆవేశం ఉందని, అం మాత్రాన రోడ్డుపై పడితే ఎలా అని సర్దిచెప్పారంతే. మనుషులే బాగుంటే పార్టీ ఇలా ఎందుకుంటుందని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు అచ్చెన్న. మొత్తమ్మీద అచ్చెన్నాయుడి వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. హోటల్ గదిలో మాట్లాడిన మాటల్ని ఎవరో వీడియో సహా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వ్యవహారం రచ్చకెక్కింది. లోకేష్ నాయకత్వంపై ప్రస్తుతం టీడీపీ పరిస్థితిపై పార్టీలోనే తీవ్ర విభేదాలున్నాయనే విషయం మరోసారి బయటపడింది.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ