బెంగళూరులో మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కూలిపోయే దశలో ఉందని ముందుగానే పసిగట్టిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆ భవనంలో ఉన్న వలస కూలీలను ఖాళీ చేయించారు. వీరిని ఖాళీ చేయించిన నిముషాల వ్యవధిలో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. బెంగళూరులోని లక్క సంద్ర ఏరియాలో ఈ సంఘటన జరిగింది. భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ముందుగా పసిగట్టడంతో ప్రాణాపాయం తప్పింది.
#WATCH | Three-storey building collapses in Lakkasandra area of #Bengaluru.
Occupants safely evacuated by fire dept. No casualties reported. pic.twitter.com/7IkQ5Xhs63
— Subodh Kumar (@kumarsubodh_) September 27, 2021
ఇవీ చదవండి..