సోషల్ మీడియా పాపులర్ అయినా తరువాత చాలామంది జీవితం అదే అయింది.. దీనివల్ల ప్రేమలు , పెళ్లిళ్లు , విడాకులు , హత్యలు , అత్యాచారాలు , బ్లాక్ మెయిల్స్ , సోమరితనం.. ఇలా ఎన్నిరకాలుగా మనిషిజీవితం మలుపులు తిరగాలో అన్నిమలుపులు తిరిగింది.. ఇప్పుడు వడోదరలో ఒక విచిత్రమైన తగాదాతో భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ గడప ఎక్కారు.. వీరిద్దరి తగాదాతో పోలీసు తలపట్టుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే .. ఫేస్ బుక్ లో భర్త , ఏ పోస్ట్ పెట్టినా , ఒక మహిళ వెంటనే లైక్ కొట్టేస్తుందట .. చాలాకాలంగా , ఇది గమనిస్తున్న భార్య , ఆ విషయమై నిలదీసింది.. నీ పోస్టుకు వెంటనే లైక్ కొట్టే ఆమె ఎవరో తేలాల్సిందేనని పట్టుబట్టింది. ఈ గొడవ పెద్దదై , ఇద్దరు చావగొట్టుకొని పోలీసు కేసులవరకు వచ్చారు.. అదీ సంగతి..